ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లినా సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయని విషయం తెలిసిందే. అయితే దీనికి గల కారణాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా వెల్లడించారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు పంపారన్నారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం పదవిని వదులుకోలేదని వివరించారు.