దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ పూర్తయ్యేసరికి సెన్సెక్స్ 269.03 పాయింట్లు కోల్పోయి 77,209.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 65.90 పాయింట్లు దిగజారి 23,501.10 వద్ద స్థిరపడింది. భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐ మైండ్ట్రీ, అదానీ పోర్ట్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్ షేర్లు రాణించగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, ఆల్ట్రాటెక్, భారత్ పెట్రోలియం, టాటా మెటార్రస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టపోయాయి.