ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. పార్టీలు ఇచ్చే హామీలు అవినీతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. హామీలు ఇవ్వడమే అవినీతి కిందకు వస్తుందంటూ సుప్రీంకోర్టులో కొందరు పిల్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిల్ను విచారణకు అంగీకరించలేదు. పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని వ్యాఖ్యానించింది.