ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్ హైవే సమీపంలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.