ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని: మంత్రి నారాయణ

55చూసినవారు
ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని: మంత్రి నారాయణ
ఏపీ రాజధానిపై మంత్రి పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతిని నిర్మించి చూపిస్తామని తెలిపారు. రాజధాని భూముల సేకరణ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో టీడీపీ హయాంలో 11లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామన్నారు. ఇప్పుడు కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణాలని కొనసాగిస్తామన్నారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్