కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి పిట్లం వస్తుండగా కుర్తిగేట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.