ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టు నీట మునిగింది. ఎయిర్పోర్టు వద్ద 20 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదైంది. రన్వే ప్రాంతమంతా మోకాలి లోతు వరదలు వ్యాపించాయి. దీంతో 500కు పైగా విమానాలను దారి మళ్లించారు. ఈ నేపథ్యంలో
భారత్ నుంచి దుబాయ్కి వెళ్లాల్స
ిన 15, దుబాయ్ నుంచి రావాల్సిన 13 విమానాలను ఎయిర్పోర్టు వర్గాలు క్యాన్సిల్ చేశాయి. అత్యవసరమైతే తప్ప ఎయిర్పోర్టుకు రావొద్దని ప్రయాణికులను హెచ్చరించాయి