ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది.