జనాల ఉత్సాహం చూస్తుంటే జూన్ 4న ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అర్థమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఆయన మాట్లాడారు. ‘బీజేపీ కార్యకర్తగా చాలా ఏళ్లు పనిచేశా. అప్పట్లో ఎన్నికల ర్యాలీకి ఉదయం 11 గంటలకు ఎవరూ రాకపోయేవారు. కానీ, ఈరోజు నేను ఇక్కడ భారీ జనసమూహాన్ని చూస్తున్నాను. సంతోషంగా ఉంది. ఈ లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.