లీగల్‌గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారు: BRS ఎమ్మెల్యే

58చూసినవారు
లీగల్‌గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారు: BRS ఎమ్మెల్యే
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము 13 సంవత్సరాల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశాము. అప్పటి నుంచి దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నాము. 2011లో మల్లారెడ్డి, నేను అసలు రాజకీయాల్లోకి రాలేదు. లీగల్ గా రమ్మంటే మాపైనే దౌర్జన్యం చేస్తున్నారన్నారు' అని అన్నారు. త్వరలోనే ఇది ఎవరి భూమి అనేది తేలిపోతుందని మల్లారెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్