పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి నర్సులు డెలివరీ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడికి చెందిన నరేశ్ భార్య శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలివరీ చేయాలని కోరగా డ్యూటీ డాక్టర్ చేయకుండా వెళ్లిపోయారు. నొప్పులు తీవ్రం కావడంతో స్టాఫ్ నర్సులు, ANMలు డాక్టర్ సలహాతో ఫోన్ లో మాట్లాడుతూ డెలివరీ చేయగా పుట్టిన మగశిశువు ఒక రోజు తర్వాత చనిపోయింది. దీంతో శ్రీజ భర్త నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.