యూపీఎస్సీ అభ్యర్థి ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లిన దుండగులు

54చూసినవారు
యూపీఎస్సీ అభ్యర్థి ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లిన దుండగులు
ముంబైలో దారుణం జరిగింది. అంధేరికి చెందిన 26 ఏళ్ల మహిళా యూపీఎస్సీ అభ్యర్థిపై కెమికల్ పౌడర్ చల్లి ఆమె ల్యాప్‌టాప్‌ను ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాగ్‌లో ల్యాప్‌టాప్ ఉందని, దానిని తన స్నేహితురాలికి ఇవ్వడానికి తీసుకెళ్తుండగా దుండగులు అపహరించారని పోలీసులకు తెలిపింది. పౌడర్ చల్లడం వల్ల తన ముఖంపై దద్దుర్లు వచ్చాయని, దుస్తులు కూడా కాలిపోయాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్