తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ ఉంటోందని.. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం పడుతోందని వివరించింది.