వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ అన్ సె యంగ్కు గాయమైంది. ఇండియా ఓపెన్లో వరుస విజయాలతో క్వార్టర్స్కు చేరిన ఈ సౌత్ కొరియా అమ్మాయి.. మూడో రౌండ్లో గాయపడింది. మోకాలికి దెబ్బ తగలడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. శుక్రవారం ఢిల్లీ వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 19-21, 0-3 తేడాతో జియా మిన్ యో (సింగపూర్) చేతిలో అన్ సె యంగ్ ఓడిపోయింది.