తమిళనాడులోని తిరునల్వేలిలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. దీపక్ రాజా అనే యువకుడిపై కొందరు దాడి చేశారు. ఓ ప్రైవేట్ హోటల్ ముందు కత్తులతో ప్రియురాలి కళ్ల ముందే అతడిని నరికి చంపారు. దీపక్కు అతడి ప్రియురాలికి వచ్చే నెల 2వ తేదీన వివాహం జరగనుంది. అంతలోనే ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ హత్యపై బాలయంకోట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.