మెహుల్ ప్రజాపతి కెనడాలోని టీడీ బ్యాంకులో డాటా సైంటిస్టుగా పని చేస్తున్నాడు. ఏడాదికి రూ.60 లక్షలు జీతం. అయితే ఇతడు యూనివర్సిటీల్లో పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఫుడ్ బ్యాంకుల నుంచి పండ్లు, కూరగాయలు, నిత్యావసరాలు వాడేసుకునేవాడు. ఇలా తిండి కోసం కక్కుర్తి పడిన భారత సంతతి వ్యక్తి వీడియోలు వైరల్ కావడంతో బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.