ఏపీలోని నెల్లూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు కాలేషా అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అమ్ములు.. తాను పని చేసే చేపల దుకాణానికి కుమారుడిని కూడా తీసుకెళ్తూ ఉండేది. ఈ నెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. అక్కడ పెట్రోల్ బాటిల్ను చూసి కూల్డ్రింక్ అనుకొని తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు.