నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

59చూసినవారు
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడితే మంత్రి మండలి ఆమోదంపై చర్చించనున్నారు. ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలపై మంత్రులు మాట్లాడనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్