ఎన్నిక‌ల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ

56చూసినవారు
ఎన్నిక‌ల సంఘానికి అచ్చెన్నాయుడు లేఖ
విశాఖ కంచరపాలెంలో ఓ కుటుంబంపై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి, సీఈవో, డీజీపీకి టీడీపీ నేత అచ్చెన్నాయుడు లేఖ రాశారు. "నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన సంస్థలపై కేసులు పెట్టారు. మీడియాపై కేసులు ఎత్తివేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి." అని లేఖ‌లో ఆయ‌న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్