రేపు దేశవ్యాప్తంగా సంతాప దినం

60036చూసినవారు
రేపు దేశవ్యాప్తంగా సంతాప దినం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అధ్యక్షుడి మృతికి నివాళులర్పిస్తూ మంగళవారం జాతీయ సంతాపదినం పాటించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవతనం చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం ఎలాంటి వినోద కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రభుత్వ అధికారులకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్