అలెర్ట్.. రేపు 49 మండలాల్లో వడగాలులు

62చూసినవారు
అలెర్ట్.. రేపు 49 మండలాల్లో వడగాలులు
AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం-12, విజయనగరం-16, మన్యం-13, అల్లూరి-1, కాకినాడ-2, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని CS కె.విజయానంద్ సూచించారు.

సంబంధిత పోస్ట్