సచివాలయంలో పవన్‌కు ఛాంబర్ కేటాయింపు

79చూసినవారు
సచివాలయంలో పవన్‌కు ఛాంబర్ కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జ‌న‌సేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు రాష్ట్ర సచివాలయంలో ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 గదిని ప‌వ‌న్ కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్