కర్ణాటకలోని మాజీ MLC భానుప్రకాష్ (69) గుండెపోటుతో కన్నుముశారు. చమురు ధరల పెరుగుదలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో గుండెపోటు రావడంతో మరణించారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మాజీ సీఎం యడ్యూరప్ప, ఈశ్వరప్ప సహా సీనియర్ నేతలతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేశారు.