రాజం సబ్ స్టేషన్ దగ్గర రెండో రోజు కొనసాగుతున్న ధర్నా

81చూసినవారు
రాజం సబ్ స్టేషన్ దగ్గర రెండో రోజు కొనసాగుతున్న ధర్నా
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజం సభ స్టేషన్ లో రంగలి నరసింగరావు షిఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఆరోగ్య సమస్య వల్ల మరణించారు. అధికార పార్టీ రాజకీయ పైరవీలతో స్థానికేతరుడైన దొండపూడికి చెందిన వ్యక్తిని విద్యుత్‌ శాఖాధికారులు నియామకం చేసారని మృతుని భార్య రామలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఉద్యోగం తన మరిదికి ఇవ్వాలంటూ ఆమె తన కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్