బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొయ్యూరు మండలంలోని మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో మండలంలోని యూ. చీడిపాలెం పంచాయతీ పరిధి యూ. చీడిపాలెం నుంచి వీరవరం తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో కొండవాగు పొంగి ప్రవహిస్తుంది. దీనితో గిరిజనులు రాకపోకలకు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ రమేష్ తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం అధికారులు స్పందించాలని శనివారం ఆయన కోరారు.