మేడపర్తి సబ్ సెంటర్లో ఘనంగా పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం

55చూసినవారు
మేడపర్తి సబ్ సెంటర్లో ఘనంగా పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం
అనంతగిరి మండలం, మేడపర్తి గ్రామ సబ్ సెంటర్లో ఐ. సి. డి. ఎస్ సూపర్వైజర్ ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆమె గర్భిణీలకు, బాలింతలకు, కిషోర్ బాలికలకు, పౌష్టికాహారం గురించి క్లుప్తంగా వివరించి తెలిపారు. ఎటువంటి పౌష్టికాహారం తింటే అన్ని పోషక విలువలు కలిగి ఆరోగ్యంగా ఉంటారనే వాటి గూర్చి తెలిపారు. కిషోర్ బాలికలకు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్