గిరిజనులకు నిత్యవసర సరుకులు,దుస్తులు పంపిణీ

83చూసినవారు
గిరిజనులకు నిత్యవసర సరుకులు,దుస్తులు పంపిణీ
డుంబ్రిగుడ మండలంలోని పుట్టబొందు గ్రామంలో సోమవారం కృష్ణమూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక గిరిజనులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని అత్యవసర సమయాలలోనే బయటకు రావాలని ఆమె స్థానికులకు తెలిపారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక గిరిజనులకు కావలసిన నిత్యవసర సరుకులు, దుస్తులు ఆమె అందజేశారు.

సంబంధిత పోస్ట్