పాడేరులో ప్రమిదలతో ప్రతిమ పై దీపారాధన

84చూసినవారు
పాడేరులో ప్రమిదలతో ప్రతిమ పై దీపారాధన
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహిళలు వినాయకుని ప్రతిమ ముగ్గువేసి ఆ ముగ్గుపై ప్రమిదలతో దీపారాధన చేసి ఔరా అనిపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు అంబేడ్కర్ కూడలిలో మోద వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో శనివారం దీపారాధన పోటీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళామణులు పాల్గొనగా ఈ పోటీల్లో వినాయకుని ప్రతిమ పై దీపారాధన చేసిన వారికి ఉత్సవాల ప్రెసిడెంట్ బేరా నాని షీల్డును బహుకరించారు.

సంబంధిత పోస్ట్