ప్రజా సంక్షేమమే లక్ష్యం

83చూసినవారు
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. రెండవ రోజు శనివారం పెందుర్తి మండలం ప్రహ్లాదపురంలో నిర్వహించిన'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్