పెందుర్తి : వైభవంగా అమ్మవార్ల తిరువీధి ఉత్సవం

62చూసినవారు
పెందుర్తి :  వైభవంగా అమ్మవార్ల తిరువీధి ఉత్సవం
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం సింహాచలం ఆలయంలో చతుర్భుజ తయారు, సువర్ణ అమ్మవార్ల బేడా మండపం తిరువీధి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవార్లను నూతన వస్త్రాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పల్లకిలో అధిష్టింప చేశారు. అనంతరం వేద పండితులు, పురోహితుల వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ తో పాటు పలువురు వేద పండితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్