విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు "పల్లె పండగ" వారోత్సవాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. రూ. 29. 04 కోట్ల అంచనాతో 322 పనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.