విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ సీఎం
జగన్ ఆవిష్కరించారు. 206 అడుగులతో నిర్మించిన ఈ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. 18 ఎకరాల విశాల ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. కింది భాగంలో బౌద్ద వాస్తు శిల్ప కళలోని కాలచక్ర మహా మండపం డిజైన్తో పీఠం ఏర్పాటు చేశారు.