ఈ పంట నమోదు గడువు 23కి పెంపు

58చూసినవారు
ఈ పంట నమోదు గడువు 23కి పెంపు
వరదలు విపత్తు కారణంగా ఈ పంట నమోదు చేయుటకు నెల 23 వరకు వారం రోజులు గడువు పెంచుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు మండల వ్యవసాయధికారి బి భాస్కర రావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చయ్యపేట మండలంలోని రైతులందరూ మీరు వేసిన ప్రతి పంటను కూడా మీకు సంబంధించిన వ్యవసాయ లేక ఉద్యాన సహాయకులను సంప్రదించి వివరములు సమర్పించి, పంట నమోదు చేసుకోవడంతో పాటు ఈ కేవైసీ కూడా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్