మంగళగిరి సన్నిధిలో పాండిచ్చేరి హోంమంత్రి ప్రత్యేక పూజలు

66చూసినవారు
మంగళగిరి నగరంలో వేంచేసియున్న శ్రీలక్ష్నీనరసింహుని సన్నిధిలో పాండిచ్చేరి రాష్ట్ర హోంమంత్రి ఏ. నమశ్శివాయం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. తొలుత లక్ష్మీనరసింహుని అనంతరం రాజ్యలక్ష్మీ అమ్మవారిని నమశ్శివాయం దర్శనం చేసుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్వామివారి సేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్