తాడిపత్రి ఘటనపై స్పందించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి

62చూసినవారు
తన వైపు నుంచి ఎలాంటి తప్పులేదని సీఐ స్పష్టం చేశాడు. లా అండ్ ఆర్డర్ విఘాతం కలుగుతుంది అని ఆ సమయంలో క్షమాపణ కోరానని, ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని కాదని అది డీఎస్పీ విచారణ చేస్తాడు అని ఎమ్మెల్యేతో చెప్పానన్నారు. తాడిపత్రి లో 14 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నా ఎలాంటి ఇబ్బందులూ రాలేదన్నారు. ఎస్పీ దృష్టికి నిన్న జరిగిన విషయాన్ని వివరించినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్