టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు: ప్రభాకర్ చౌదరి

3620చూసినవారు
అనంతపురం అర్బన్ టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసి డబ్బులు ఉన్నవాళ్లకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని టిడిపి అధినేత చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. శుక్రవారం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ పార్టీ కోసం అయిదు సంవత్సరాల నుంచి సొంత ఆస్తుల్ని అమ్ముకుని పనిచేశానని అన్నారు. కార్యకర్తలపై కేసులు బనాయించినా నిలబడ్డాం అని అన్నారు. కాబట్టి కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్