రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

50చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కంబదూరు మండలం కదిరిదేవరపల్లి వద్ద బుధవారం బళ్లారి నుంచి పావగడ వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగంతో వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గుమ్మఘట్ట మండలం మారెంపల్లికి చెందిన రమేష్ నాయక్ గా పోలీసులు గుర్తించారు. తన వ్యవసాయ పొలం నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఇన్నోవా ఢీకొట్టిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్