ఊరూరా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి

65చూసినవారు
ఊరూరా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి
గ్రామాల్లోని ప్రజలందరూ ఊరూరా పచ్చని చెట్లు పెంచాలని ఎంపీడీవో గీతా వాణి, సర్పంచ్ శశికళ, టీడీపీ నేత శ్రీనివాసులు కోరారు. శుక్రవారం రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీలో మొక్కలు నాటారు. ఎంపీడీవో గీతా వాణి మాట్లాడుతూ. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లోని వీధుల్లో, ఊరి ముందర చెట్లు నాటి సంరక్షించాలన్నారు. నాటిన చెట్లకు సకాలంలో నీటిని సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్