తాడిపత్రి మండలంలో జిల్లా విద్యాధికారి వరలక్ష్మి పర్యటించారు. జూనియర్ కళాశాలలో తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించాలన్న సంకల్పంతో ముందడుగులు వేయాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.