తేనెటీగలు దాడి.. పలువురికి గాయాలు

55చూసినవారు
వజ్రకరూరు మండలం పందికుంట వద్ద బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ, బైక్ పై వెళుతున్న వ్యక్తులపై తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేశాయి. దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని అబ్జర్వేషన్లో ఉంచామని మిగతా 6 మందినికి చికిత్స అందించి ఇంటికి పంపామని వైద్యులు చెప్పారు. పొలాల్లో ఎవరో పొగ పెట్టడం వల్ల అవి తమపై దాడి చేశాయని బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్