విద్యుదాఘాతంతో రైతు మృతి

67చూసినవారు
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని చిన్న ముష్టూరుకు చెందిన నరసింహులు (50) కూలీ పనులు చేసుకుంటూ ఆలయ భూమిని కౌలుకు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ఏడాది కంది, వేరుసెనగ పంటలను సాగు చేశారు. పంటలకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. మృతుడికి భార్య లింగమ్మ, కుమారుడు, కుమారై ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్