వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయని, వడదెబ్బ ప్రాణాంతకమని, ఉపాధి కూలీలు వడదెబ్బ పట్ల అవగాహన కలిగి ఉండాలని సిహెచ్ఓ నాగరంగయ్య తెలిపారు. రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యాధికారి డా. వెంకటేష్ నాయక్ ఆదేశాల మేరకు శనివారం వైద్య సిబ్బంది నేరమెట్ల గ్రామంలో ఉపాధి కూలీలకు వడదెబ్బ సోకకుండా అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఎండలో తిరగరాదని సూచించారు.