త్రాగునీటి సరఫరా కార్యాలయం ఎదుట మహిళల నిరసన

1052చూసినవారు
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి ఏనాడూ చిత్తశుద్ధి చూపింది లేదు. ఉరవకొండ, మరో ఏడు గ్రామాలకు తాగునీటి అందించే నింబగల్లు ఎస్ఎస్ ట్యాంకులు అడుగంటి, ఎండుముఖం పట్టాయి. దీంతో తాగునీరు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఉరవకొండలోని పాతపేట, సత్యనారాయణపేటకు చెందిన మహిళలు త్రాగునీరు రాకపోవడంతో ఖాళీ బిందెలతో ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్