ఆర్థిక మంత్రి, డోన్ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పెండింగ్లో పడింది. ఎన్నికల అఫిడవిట్లో బుగ్గన తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన డోన్ ఎన్నికల అధికారి.. ప్రస్తుతం బుగ్గన నామినేషన్ను పెండింగ్లో ఉంచారు. ఇవాళ సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరఫు న్యాయవాదికి నోటీసులు ఇచ్చారు.