అనంతలో టీడీపీకి మరో షాక్‌

52చూసినవారు
అనంతలో టీడీపీకి మరో షాక్‌
అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. మంగళవారం టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధికార ప్రతినిధి జేఎం బాషా ఆ పార్టీని వీడారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన నివాసం వద్ద వైసీపీలో చేరారు. ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్