జెడ్పీ ఉద్యోగి ఆకస్మిక మృతి

82చూసినవారు
జెడ్పీ ఉద్యోగి ఆకస్మిక మృతి
అనంతపురం జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మల్లికార్జున గుండెపోటుతో మరణించారని తెలిసి జెడ్పీ ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఉద్యోగుల్లో విషాదం మిగిల్చింది.

సంబంధిత పోస్ట్