తమ నాయకుడికి టికెట్ దక్కలేదని పురుగుల మందు తాగిన దంపతులు

25516చూసినవారు
అనంతపురం టికెట్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఇందిరమ్మ కాలనీకి చెందిన భార్యా భర్తలు రాజు, రూప పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు స్పందించి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రభాకర్ చౌదరి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్