రానున్న ఎన్నికలు వైఎస్ జగన్ విశ్వసనీయతకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుతున్నవని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 2వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గంలో ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.