49వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఎఐఎస్ఎఫ్

58చూసినవారు
49వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఎఐఎస్ఎఫ్
విజయనగరంలో జరిగే ఎఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల లోగోను ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయప్ప ఆవిష్కరించారు. గురువారం అనంతపురం జిల్లా సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఖాళీగా ఉన్న బోధన & బోధనేతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్