దళితుల స్మశానలను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

52చూసినవారు
దళితుల స్మశానలను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
బసంపల్లిలో దళితుల స్మశాన వాటికలను కబ్జా చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. శనివారం ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ముందు బసంపల్లి గ్రామ దళితులలో కలసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసంపల్లిలో మాలలకు చెందిన స్మశాన వాటికను దౌర్జన్యపరులు ఆక్రమించుకున్నారని, అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్